గ్రేటర్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి .అందులో భాగంగా బీజేపీ పార్టీ తమ అభ్యర్థుల ప్రచార పనులను  వేగవంతం చేస్తుంది ..  పార్టీ  ప్రచారం కోసం ప్రముఖులందరిని బరిలోకి దింపుతోంది .. గ్రేటర్ ఎన్నికల సందర్బంగా బీజేపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ  ప్రముఖులందరూ ఎక్కడెక్కడి నుండి  హైదరాబాద్ కి వస్తున్నారు ..

దీంతో గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ప్రచారం మిగతా పార్టీ లతో పోలిస్తే  హోరాహోరీగా సాగనుంది .. ఏపీ కి చెందిన కొందరు బీజేపీ నేతలు హైదరాబాద్ లో ఉన్న సందర్బంగా వారిని  కూడా ప్రచారం లో  పాల్గొనమని బీజేపీ పెద్దల నుండి కబురు వస్తుంది .. ఈ నేపథ్యం లో బీజేపీ మహిళా నేత సాధినేని యామిని కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల పై దృష్ట్టి పెడుతున్నట్లు కనిపిస్తుంది .. అతి తొందర్లోనే యామిని కూడా పార్టీ ప్రచారం లో పాల్గొంటారని వార్తలు వినబడుతున్నాయి ..

పార్టీ ప్రచారం లో పాల్గొనే ముందు సాధినేని యామిని  మిగతా పార్టీలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు .. హైదరాబాద్ ని కబ్జాల రాజధానిగా చేసారని మొన్న సంభవించిన చిన్న పాటి  వర్షాలకే హైదరాబాద్  మునిగిపోయిందని దీనికి కారణం తెరాస నేతలు చెరువులను కబ్జాలు చేయడమే అంటూ ఆమె ఆరోపించారు ..అలాగే కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కష్టాలు పడుతున్నారని విమర్శించారు ..  

అధికార పార్టీ కి చురుక్కులు పెడుతూ తమ పార్టీని ఆకాశానికి ఎత్తేసే వ్యాఖ్యలు చేసారు సాదినేని యామిని ..ఈ సందర్బంగా చెప్తూ ఒక దళితున్ని రాష్ట్రపతి హోదాలో కూర్చోబెట్టిన ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని అన్నారు ..  అన్ని వర్గాల వారిని ఆదుకునే పార్టీ బీజేపీ మాత్రమే అని అన్నారు .. ఈ గ్రేటర్ ఎన్నికలో బీజేపీ పార్టీ ఖచ్చితంగా అధికారం లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసారు యామిని ..



మరింత సమాచారం తెలుసుకోండి: