జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం అన్ని పార్టీల అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేపడుతూ ఓటర్ మహాశయులకు ఆకట్టుకునేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. సాధారణంగానే ఎన్నికలు వచ్చాయంటే చాలు ప్రజాప్రతినిధులు అందరూ ప్రజల వద్ద వాలిపోతూ ప్రజలమధ్య ఉంటూ ప్రజల మధ్య జీవిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓటర్లు అందరిని ఆకట్టుకునేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తుంటారు. ఇక ఇప్పుడు కూడా గ్రేటర్ పరిధిలో ఎక్కడ చూసినా జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ కూడా తీవ్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.



 ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రస్తుతం ఓటర్లను తమ ఓటు వేసి ఒక సారి అవకాశం ఇవ్వాలని అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామూ  అంటూ హామీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల వెంకటాపురం డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంజీవ్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వెంకటాపురం డివిజన్లో ఇది వరకు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప గత ఐదేళ్లలో టిఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఓటర్లు అందరూ తమకు ఓటు వేయాలి అంటూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్ మహాశయులకు సూచించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంజీవ్ కుమార్.



 వెంకటాపురం డివిజన్ ఖైరతాబాద్ నియోజకవర్గం లో ఉన్నప్పుడు స్వర్గీయ జనార్దన్ రెడ్డి వెంకటాపురం డివిజన్లో ఎంతగానో అభివృద్ధి చేశారని ఆయన చేసిన అభివృద్ధి ప్రస్తుతం కనిపిస్తుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవలే మంగళవారం ఉదయం సమయంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన.. తమకు ఓటు వేయాలంటూ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. పేదల ఆకాంక్షలకు అనుగుణంగానే కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్ధం చేసింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు టిఆర్ఎస్ నమ్మే పరిస్థితులు లేరని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని వెంకటాపురం డివిజన్లో తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగుర వేస్తాము అంటూ ధీమా వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: