జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రచార హోరుకు కనపడుతుందన్న విషయం తెలిసిందే.  గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో కూడా ఆయా పార్టీల ప్రస్తుతం ముమ్మర ప్రచారం చేస్తూ  ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో  ముందుకు సాగుతున్నారు అన్ని పార్టీల అభ్యర్థులు. ఈ క్రమంలోనే అన్ని పార్టీల లోని ముఖ్య నేతలు ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు.


 ఇటీవలే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతు రావు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు మచ్చ బొల్లారం డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థి. భారీ ర్యాలీ నిర్వహించి ప్రస్తుతం ఓటర్లు తమ ఓటు వేసి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి అంటూ పిలుపునిచ్చారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో డివిజన్ను ఎన్నడూ చూడని విధంగా అభివృద్ధి చేస్తాం అంటూ హామీ ఇచ్చారు మచ్చ బొల్లారం డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థి రాజ్ జితేంద్ర నాథ్ అన్నారు. ఈ క్రమంలోనే మచ్చ బొల్లారం డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థి జితేంద్ర నాథ్ ప్రచారానికి మద్దతు ప్రకటించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి.. మచ్చ బొల్లారం డివిజన్ తుర్కపల్లి తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు.



 ప్రస్తుతం మచ్చ బొల్లారం డివిజన్లో మురుగునీటి కాలువ ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తుతం ఈ మురుగునీటి కాలువ నిర్మాణం జరుగుతుందని ఈ కాలువ నిర్మాణం పూర్తయితే ప్రజలందరికీ ఎంతో మేలు చేకూరుతుంది అంటూ అభ్యర్థి రాజ్  జితేంద్ర నాథ్ తెలిపారు. అంతేకాకుండా గత పాలనలో ప్రభుత్వం బుడగ జంగాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది తప్ప ఎక్కడా పొజిషన్ చూపించలేదని కానీ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే బుడగజంగాలు ఆదుకుంటామని చెప్పారు. అంతేకాకుండా అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పించే విధంగా ఈ సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఈ సందర్భంగా పద్మాదేవేందర్రెడ్డి ఓటర్లకు హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: