గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ-ఎం‌ఐ‌ఎం పార్టీలు తీవ్ర మాటల యుద్ధానికి దిగాయి. బీజేపీ పూర్తిగా హిందుత్వ పార్టీగా ఉంటే, ఎం‌ఐ‌ఎం ముస్లిం పార్టీగా ముద్రవేసుకుంది. దీంతో ఈ రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అసలు ఎన్నికల ప్రచారం మొదలవ్వడమే ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. బీజేపీ గెలిస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని బీజేపీ నేతలు హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

అటు ఎం‌ఐ‌ఎం కూడా బీజేపీకి ధీటుగా మాట్లాడుతోంది. అయితే వీరి మాటల యుద్ధంలోకి దివంగత నేతలు పీవీ నరసింహారావు, ఎన్టీఆర్‌లు వచ్చారు. 4,700 ఎకరాలున్న హుస్సేన్‌సాగర్ ఇవాళ 700 ఎకరాలు కూడా లేదని, అక్రమ కట్టడాలను కూల్చేస్తామంటున్నారని.. అలా అయితే హుస్సేన్‌సాగర్ కట్టపై ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు.

ఇక అక్బరుద్దీన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెంటనే కౌంటర్ ఇచ్చేశారు. హుస్సేన్ సాగర్‌పై ఉన్న పీవీ సమాధిని, ఎన్టీఆర్ సమాధిని కూల్చే దమ్ము నీకుందా? నీ అయ్య జాగీరా, నీ తాత జాగీరా భాయ్ అంటూ ఫైర్ అయిన బండి సంజయ్... పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చిన రెండుగంటల్లో నీ దారుస్సలాంను బీజేపీ కార్యకర్తలు కూల్చేస్తారుని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే పీవీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి, ఎన్టీఆర్ టీడీపీకి చెందిన వ్యక్తి అని అందరికీ తెలిసిందే.

వీరిని పార్టీలకు అతీతంగా అభిమానించే వారు ఉన్నారు. ఇక వీరి సమాధులపై ఎం‌ఐ‌ఎం ఎమ్మెల్యే కామెంట్ చేయగానే బీజేపీ స్పందించడం గమనార్హం. ఎం‌ఐ‌ఎంకు ధీటుగా కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే బండి సంజయ్ స్పందించినట్లు తెలుస్తోంది. ఇలా పీవీ, ఎన్టీఆర్ సమాధుల విషయంలో అధికార టీఆర్ఎస్ కూడా స్పందించింది. అక్బరుద్దీన్ వ్యాఖ్యలని ఖండిస్తున్నట్లు కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా చెప్పారు. ఇక విషయంలో బీజేపీ స్పందించడం వల్ల ఆ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: