జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల గెలుపు కోసం హిందూ,ముస్లిం మతాలను కొన్ని పార్టీలు అడ్డుపెట్టుకుంటున్నాయి అని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వీ హనుమంత రావు వ్యాఖ్యానించారు . ఆయన‌ గ్రేటర్‌ వార్‌పై మాట్లాడుతూ..ప్రచారం లో భాగంగా రాజకీయ పార్టీలు ముందుకు సాగుతున్నాయి కానీ ప్రజలు తెలివైన వారు ఎవరికి ఓటు వెయ్యాలో అన్న దానిపై ప్రజలకు అవగాహన వుంది అన్నారు. .

 నగరంలో చాలా వరకు కే‌సి‌ఆర్,కే‌టి‌ఆర్, పోటోలే కనబడుతున్నాయి అన్నారు. బండి సంజయ్ సర్జికల్ స్ట్రెక్ చేస్తాననడం సమంజసం కాదన్నారు. అక్బరుద్దీన్,బండి సంజయ్ మతం ముసుగులో ప్రజలని రెచ్చగొడుతున్నారు.

ప్రశాంత వాతావరణం ఉన్న హైదరాబాద్‌లో ఘర్షణ వాతావరణం సృస్టించాలని చూస్తున్నరని వి‌హెచ్ అన్నారు.ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడుతున్నారని ఇలాంటి వారిని అస్సలు నమ్మరాని ఆయన తెలిపారు.ప్రజలలో మత విద్వేషాలు సృస్టించి రక్తపాతం చేసి ఓట్లు తీసుకోవాలని బండి చూస్తున్నారు. ప్రజలు ఇలాంటి మాటలు నమ్మరాని ఆయన తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: