అయితే పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత గ్రేటర్ ప్రచారంపై ఓ క్లారిటీ వచ్చింది. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలసిన అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ ఎక్కడా గ్రేటర్ ఎన్నికల గురించి ప్రస్తావించలేదు. గ్రేటర్ బరిలో తాను ప్రచారం చేపడతానని కూడా ప్రకటించలేదు. దీంతో పవన్ హైదరాబాద్ లో బీజేపీ తరపున ప్రచారం చేపట్టే అంశంపై పూర్తిగా క్లారిటీ వచ్చేసింది.
ఇప్పటికే గ్రేటర్ లో బీజేపీ తరపున మహామహులు ప్రచారంకోసం వస్తున్నారు. కేంద్ర మంత్రులు ఆల్రడీ వచ్చేశారు, ఇతర రాష్ట్రాల ముఖ్యమత్రులు కూడా వస్తారని అంటున్నారు. దుబ్బాక ఫలితంతో గ్రేటర్ పై పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకుంది బీజేపీ. ఎంఐఎంని నిలువరించి బల్దియా పీఠం దక్కించుకునే ఆశ లేకపోయినా.. కనీసం ప్రతిపక్షంలో కూర్చుని అయినా టీఆర్ఎస్ ఆధిపత్యానికి గండి కొట్టాలని అనుకుంటున్నారు బీజేపీ నేతలు. అందుకే గ్రేటర్ ఎన్నికలపై పూర్తి స్థాయిలో నమ్మకం పెట్టుకున్నారు. అదే ఊపులో జనసేనను పక్కకు తప్పించి మరీ బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది.