క్లుప్తంగా దిశ యాప్ గురించి..
ఇప్పటి వరకూ 11 లక్షలకు పైగా యూజర్లు ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకున్నారు.
దిశ యాప్ ద్వారా సహాయం కోరిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాష్ట్రంలో 604 మంది మహిళలకు అండగా నిలిచారు.
దిశ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను దర్యాప్తు చేసిన పోలీసులు 122 కేసులు నమోదు చేశారు.
బాధిత మహిళలు ఎక్కడినుంచైనా నా ఫిర్యాదు చేయొచ్చనే వెసులుబాటుతో పోలీసులు 341 జీరో ఎఫ్ఐఆర్ లు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దిశ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరిగిన అమానుష ఘటనల్లో నిందితులకు సత్వరమే శిక్షలు పడేలా చేయడంపై పోలీసులు పట్టుసాధిస్తున్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి సంఘటనల్లో 79 కేసుల్లో తీర్పులు వచ్చాయి.
ప్రతి మహిళా తన మొబైల్ లో ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాలని పోలీసులు తెలియజేశారు. తమకే కాకుండా తమ పరిసరాల్లో ఏ మహిళకు అన్యాయం జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించేలా ఈ అవకాశాన్ని ఉపయోగించు కోవాలని సూచిస్తున్నారు.