ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యం లో అందరూ అభ్యర్థులు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటర్ల ను ఆకట్టుకునేందుకు ఇంటింటి ప్రచారం నిర్వహించడంతోపాటు ర్యాలీలు సభలు ప్రసంగాల తో ప్రస్తుతం ఓటర్లను ఆకట్టు కునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు అంతే కాకుండా అన్ని పార్టీల అభ్యర్థులు జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం తమకే వరిస్తుంది అని పూర్తిగా ధీమా తో ఉన్నారు. ఈ క్రమంలోనే ఉన్న కొంత సమయాన్ని కూడా ప్రస్తుతం ప్రచారానికి పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు అందరూ.



 ఆయా పార్టీల పెద్దలు కూడా ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు ఇటీవలే శేరిలింగంపల్లి లోని చందానగర్ 110 డివిజన్ పరిధిలోని విద్యానగర్ కైలాష్ నగర్ తార నగర్ పోచమ్మ దేవాలయం సాయి మారుతి కాలనీ గీతా థియేటర్ మంజీరా రోడ్డు సహా పలు కాలనీలలో.. చందానగర్ 110 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మంజుల రఘునాథరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలిచిన మంజుల రఘునాథ్ రెడ్డి ప్రస్తుతం పాదయాత్ర నిర్వహించగా భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.



 ఈ క్రమంలోనే పలు కాలనీలలో పాదయాత్రలో భాగంగా కలియతిరిగిన చందానగర్ 110వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మందుల రఘునాథ్ రెడ్డి... ఓటర్ల అందరిని ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేశారు. టిఆర్ఎస్ తోనే డివిజన్ల అభివృద్ధి సాధ్యమవుతుంది అంటూ ఆమె చెప్పుకొచ్చారు. వచ్చే డిసెంబర్ నెల నుంచి ఉచిత మంచినీరు.. నాయి బ్రాహ్మణులకు రజకులకు ఉచిత విద్యుత్  అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఎస్సారెస్పీ  నిధులతో ఫ్లై ఓవర్లు  నిర్మించడంతో పాటు అండర్పాస్ బ్రిడ్జ్ లు  కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు గత ఐదేళ్లలో శేర్లింగంపల్లి ఎంతగానో అభివృద్ధి చెందింది అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: