డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని ముషీరాబాద్ డివిజన్ బీజేపీ అభ్యర్థి ఎం.సుప్రియా నవీన్ గౌడ్ ప్రజలను కోరారు. బుధవారం ముషీరాబాద్ డివిజన్లోని మొరంబొంద, అంబేద్కర్ కాలనీ, బాపూజీనగర్, గంగపుత్రకాలనీ, తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొరంబొంద గుడిసె వాసులకు పక్కా గృహాలు నిర్మించేందుకు కృషి చేస్తానని అన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా డివిజన్లో మంచినీరు, డ్రైనేజీ పైప్ లైన్లను ఆధునికికరిస్తామన్నారు. వర్షాకాలం వచ్చిందంటే రోడ్లన్నీ బురుదమయమవుతున్నాయని, అధ్వాన స్థితికి చేరుకున్న రోడ్లను మోడల్ రోడ్లుగా తీర్చిదిద్దేందుకు ఒక్కసారి అవకాశం కల్పించాలన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు. బీజేపీ గెలుపే టీఆర్ఎస్కు గుణపాఠమన్నారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ బీజేపీ జాయింట్ కన్వీనర్ ఎం.నవీన్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు బద్రి నారాయణ, బీజేపీ నాయకులు కుశాల్ గౌడ్, కంచి, సత్య నారాయణ, అనిల్, సురేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని ముషీరాబాద్ డివిజన్ బీజేపీ అభ్యర్థి ఎం.సుప్రియా నవీన్ గౌడ్ ప్రజలను కోరారు. బుధవారం ముషీరాబాద్ డివిజన్లోని మొరంబొంద, అంబేద్కర్ కాలనీ, బాపూజీనగర్, గంగపుత్రకాలనీ, తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొరంబొంద గుడిసె వాసులకు పక్కా గృహాలు నిర్మించేందుకు కృషి చేస్తానని అన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా డివిజన్లో మంచినీరు, డ్రైనేజీ పైప్ లైన్లను ఆధునికికరిస్తామన్నారు. వర్షాకాలం వచ్చిందంటే రోడ్లన్నీ బురుదమయమవుతున్నాయని, అధ్వాన స్థితికి చేరుకున్న రోడ్లను మోడల్ రోడ్లుగా తీర్చిదిద్దేందుకు ఒక్కసారి అవకాశం కల్పించాలన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు. బీజేపీ గెలుపే టీఆర్ఎస్కు గుణపాఠమన్నారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ బీజేపీ జాయింట్ కన్వీనర్ ఎం.నవీన్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు బద్రి నారాయణ, బీజేపీ నాయకులు కుశాల్ గౌడ్, కంచి, సత్య నారాయణ, అనిల్, సురేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.