టిఆర్ఎస్ పార్టీ జన సమీకరణ విషయంలో ముందు ఉన్నా సరే భారతీయ జనతా పార్టీ మాత్రం జన సమీకరణ విషయంలో వెనుకబడి ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారం చేసినా చాలామంది స్థానిక నాయకులు కనీసం ప్రచారం చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. కార్యకర్తలు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కొంతమంది మీద ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వం హైదరాబాదులో ఆగ్రహంగా ఉంది. జన సమీకరణ విషయంలో కూడా వారి నుంచి సహకారం అందడం లేదని దీంతో ఇప్పుడు కొంతమంది ప్రచారం చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.
ప్రచారం చేసే విషయంలో జనసమీకరణ లేకపోతే గనుక మీడియాలో నెగటివ్ గా హైలెట్ అయ్యే అవకాశం ఉంటుంది. కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ అనుకూల మీడియా సోషల్ మీడియా కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు జనసమీకరణ అనేది భారతీయ జనతా పార్టీకి పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు. తమకు మద్దతు ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రచారం చేసుకోలేక పోతుంది. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం ఇప్పుడు కాస్త ఆసక్తికరంగానే ఉన్నాయి అనే విషయం చెప్పవచ్చు.