అయితే భారతీయ జనతా పార్టీలోకి వెళ్తే ఇప్పుడు ఉపయోగం లేదని కాబట్టి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే మంచిది అని కొంతమంది నేతలు భావిస్తున్నారు. మెజారిటీ నేతలు మాత్రం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు అనే భావన వ్యక్తమవుతోంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉండవచ్చు. అక్కడి విపక్షాలు ఆయనను టార్గెట్ గా చేసుకుని కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. హైదరాబాదులో ఉన్న తమ నేతలను భారతీయ జనతా పార్టీ లోకి పంపించి ఆ పార్టీకి పరోక్షంగా సీఎం జగన్ సహకారం అందిస్తున్నారని ఆరోపించే అవకాశాలు కూడా ఉండవచ్చు.
మరి ఎలా వ్యవహరిస్తారు ఏంటి అనేది చూడాలి. అయితే ఇప్పుడు కొంత మంది నేతలు మాత్రం టిఆర్ఎస్ పార్టీ నేతలతో ఎక్కువగా చర్చలు జరుపుతున్నారు. టిఆర్ఎస్ పార్టీకి వైసీపీకి ముందు నుంచి కూడా కాస్త స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడుతుంది అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు ఇప్పుడు హైదరాబాదులో ఆసక్తికరంగా మారాయి. బీజేపీ లోకి వెళ్తారా స్నేహాన్ని నమ్ముకుని టిఆర్ఎస్ లోకి వస్తారా అనేది చూడాలి.