దీంతో టీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? అనే అనుమానాలు అందరిలోనూ మొలకలు ఎత్తాయి. ఈ క్రమంలో తాను టీఆర్ఎస్ ఎందుకు వీడిందీ స్వామి గౌడ్ వెల్లడించారు. పార్టీలో తనకు ఎదురైన సమస్యలను వివరించారు. తాను కారణం లేకుండా పార్టీని వీడలేదని, అలా తాను ఎప్పటికీ చేయబోనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ హయాంలో శాసన సభ చైర్మన్గా స్వామి గౌడ్ పని చేశారు. ఇలాంటి కీలక పదవి కట్టబెట్టిన కేసీఆర్కు ఇలా గుడ్ బై చెప్పడం ద్రోహమేనని కొందరు చేస్తున్న విమర్శలపై కూడా స్వామి గౌడ్ స్పందించారు.
సీఎం కేసీఆర్ తనకు శాసన మండలి చైర్మన్ పదవి ఉట్టి పుణ్యానికేమీ ఇవ్వలేదని స్వామి గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రాష్ట్రం కోసం చాలా కష్టపడ్డామని, అందుకే తనకు ఆ పదవి వచ్చిందని తెలిపారు. పార్టీకి కావాల్సినంత మెజార్టీ ఉన్నప్పుడు వేరే పార్టీ వ్యక్తులతో పనేంటని? కానీ కేసీఆర్కు ఇవేమీ పట్టవని ఇతర పార్టీల నేతలను చేర్చుకుని, వారికి పెద్ద పీట వేయడం మొదలు పెట్టారని విమర్శించారు. అసలు వేరే పార్టీ వాళ్లను టీఆర్ఎస్లోకి తీసుకోవడమే కేసీఆర్ చేసిన తప్పు అన్నారు. ఇతర పార్టీలవారికి ఇచ్చిన గౌరవం కూడా కేసీఆర్ తనకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్బరుద్దీన్ వంటి వారు చేసే వివాదాస్పద వ్యాఖ్యలకు ధైర్యం ఎవరు ఇస్తున్నారో ప్రజలు ఆలోచించాలని చెప్పారు. మోదీ గుండె ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటున్నారని, అందుకే తాను కాషాయ పార్టీలో చేరానని స్వామిగౌడ్ వెల్లడించారు.