‘‘ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసిందో అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు. అందుకే పాలనలో మార్పు కావాలని ప్రజలు భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. మేయర్ పీఠాన్ని కూడా బీజేపీనే కైవసం చేసుకుంటుంది. ఇక్కడ పూర్తిగా అలాంటి వాతావరణమే కనిపిస్తోంది.’’ అని ప్రహ్లాద్ మోదీ అన్నారు.
అలాగే ఈ గ్రేటర్ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ బీజేపీపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ప్రహ్లాద్ మోదీ అన్నారు. కేంద్రం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ.. తెలంగాణకు అవేమీ అందడం లేదని సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నగరంలో వరద బాధితులను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రహ్లాద్ మోదీ ప్రస్తుతం ప్రధానమంత్రి జనకల్యాణ్ యోజన అభియాన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పటికే తీవ్రస్థాయిలో వేడి పెరుగుతున్న ఈ ఎన్నికలు రాబోయే రోజుల్లో మరింత వేడిని పుట్టించడం ఖాయం.