తెలంగాణ లోని దుబ్బాక ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితం రాష్ట్రానికే కాదు దేశానికే పెద్ద షాక్ లాంటిది అని చెప్పొచ్చు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గరినుంచి ఇక్కడ టీ ఆర్ ఎస్ కు ఎదురులేదు.. అందుకే గత రెండు ఎలక్షన్స్ నుంచి గెలుస్తూ వస్తుంది. కేసీఆర్ కూడా ఇంతటి విజయాన్ని ఊహించలేదని చెప్పాలి. తొలి సారి కంటే రెండో సారి అనూహ్యమైన మెజారిటీ తో గెలిచింది టీ ఆర్ ఎస్ పార్టీ.. అయితే గత కొన్ని నెలలుగా కేసీఆర్ అవలంభిస్తున్న విధానాలు ప్రతిపక్షాలకు కాదు ప్రజలకు కూడా విసుగు తెప్పిస్తున్నాయి.. అందుకే ప్రజలు కేసీఆర్ కి వార్నింగ్ లా దుబ్బాక లో గులాబీ పార్టీ ని ఓడించారు..
అయితే అయన గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో ని రిలీజ్ చేసే సమయంలో జనాలు వేరే పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే అది హైదరాబాద్కు మంచిది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా అభివృద్ధి జరగదని.. రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నాం కాబట్టి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వేస్ట్ అని తేల్చేశారు. తద్వారా జీహెచ్ఎంసీని బీజేపీ చేజిక్కించుకుంటే తాము సహకరించేది లేదని చెప్పకనే చెప్పేశారు.కానీ ఇదే లాజిక్ కేంద్రం-రాష్ట్రం విషయంలో అప్లై చేసి చూస్తే ఎవరూ టీఆర్ఎస్కు ఓటే వేయకూడదు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి.. ఇక్కడ వేరే పార్టీకి అధికారం కట్టబెడితే వాళ్లు సహకరించరు కాబట్టి అభివృద్ధి జరగదని.. కాబట్టి బీజేపీకే ఓటేయాలని అంటే ఎలా ఉంటుంది అని బీజేపీ అంటుంది.. ఈ లాజిక్ కి ప్రజలు బీజేపీ కి మొక్కాల్సిందే..