గ్రేటర్ ఎన్నికల నేపద్యంలో కే‌సి‌ఆర్ కుటుంబం ప్రచారలతో హోరెత్తిస్తున్నారు.ప్రతి డివిజన్ పరిధిలో వుండే ప్రాంతాలను చుట్టేస్తూ దూసుకుపోతున్నారు.కే‌టి‌ఆర్ ఓ వైపు, కవిత మరోవైపు,హరీష్ రావు ఇంకోవైపు వుంది ప్రచారాన్నిపతాకస్థాయికి తీసుకెళ్తున్నారు.కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో ప్రచారంలో జోరు చూపిస్తున్నారు.

కవిత గారు ఇంత బిజీ సమయంలో కూడా  ప్రచారం చేస్తూ రోడ్డు పక్కన ఉన్న పానీ పూరి బండి దగ్గర ఆగి పానీ పూరి తిన్నారు. అంతేకాకుండా తనతో ఉన్న కార్యకర్తలకు కూడా పానీపూరి తినిపించారు. గాంధీ నగర్ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, రోడ్డు పక్కన చిరు వ్యాపారులను పలకరిస్తూ కనిపించారు కవితగారు.తాను చిన్నప్పుడు సికింద్రాబాద్ లో పాని పూరీ తిన్న సంగతి ఈ సందర్బంలో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

ప్రచారంలో భాగంగా కవిత మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ఆరేళ్లుగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని విమర్శించారు. హైదరాబాద్‌లో వరదలొచ్చినప్పుడు కనపడని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ఓట్ల కోసం హైదరాబాద్‌ వస్తున్నారని తెలిపారు. గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతుగా నిలిచి గెలిపించాలని కోరారు.మరి ఈ హోరాహోరీ పోరు లో తుది విజయం ఏ పార్టీని వరిస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: