ఇదిలా వుంటే బీజేపీ, ఎంఐఎం నేతలు చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేర్లను రాజకీయాల్లో వాడుకొని ఓట్లు అడుక్కోవడం దుర్మార్గమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.
బీజేపీ పివి,ఎన్టిఆర్,లపై ఉత్తుత్తి ప్రేమ ఒలకబోస్తుందని ఆయన ఆరోపించారు.తమ సొంత పార్టీ అధినాయకులైన అద్వానీ మరియు జోషి తదితర నాయకులకు ఆ పార్టీ గౌరవం ఇవ్వలేక పోయింది అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.నిజంగా చిత్తశుద్ది వుంటే పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ ల పై ఏ మాత్రం గౌరవం ఉన్నా వారిద్దరికీ భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.