ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో మల్కాజిగిరి నియోజకవర్గం లోని ఏ డివిజన్లో చూసినా ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్న ఘటనలే తారసపడుతున్నాయి. ఇక ఇటీవలే మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్ డివిజన్లో తెరాస అభ్యర్థి విజయశాంతి ఇంటింటి ప్రచారం నిర్వహించి టిఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. డివిజన్లో గత ఐదు సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి చూసి ప్రజలందరూ తమకు ఓటు వేసి గెలిపించాలని అంటూ ఈ సందర్భంగా ప్రజలను కోరారు.
ఈ క్రమంలోనే అల్వాల్ డివిజన్లోని పలు కాలనీలలో కలియతిరిగిన టిఆర్ఎస్ అభ్యర్థి విజయశాంతి ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. అయితే డివిజన్లో నెలకొన్న అన్ని సమస్యలను తీరుస్తామని.. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉంటాను అంటూ ప్రజలందరికీ హామీ ఇచ్చారు అల్వాల్ టిఆర్ఎస్ అభ్యర్థి విజయశాంతి. అయితే ఇతర పార్టీలతో అసలు తనకు పోటీ లేదని.. డివిజన్ లోని ప్రజలందరూ తన వైపు వున్నారు అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామూ అంటూ ధీమా వ్యక్తం చేశారు అల్వాల్ డివిజన్ అభ్యర్థి విజయశాంతి.