అభ్యర్థుల ఎంపికలో బండి సంజయ్ తనను మోసం చేశాడంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మీద సంచలన వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ ఎట్టకేలకు మెత్తబడ్డారు. ఇప్పటిదాకా ఈ అంశంలో విభేదించి ప్రచారానికి కూడా రాకుండా ఉండిపోయిన ఆయన ఈ రోజు నుంచి కూకట్పల్లి కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ప్రాంతాల్లో అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి ఆయనతో బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ సుదీర్ఘంగా భేటీ జరిపారు. 


ఎన్నికల అయిపోతే తర్వాత ఏమీ చేయలేరని ప్రస్తుతానికి ప్రచారానికి రావాలని ఆమె కోరినట్లు సమాచారం. ఎన్నికలయ్యాక ఈ అంశం మీద తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అని ఆమె పేర్కొనడంతో ముందు కాస్త తటపటాయించినా ఎన్నికల ప్రచారంలో ఈరోజు నుండి ఆయన పాల్గొంటున్నారు. ఈ రోజు రేపు అలాగే ఎల్లుండి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ఇక ఆయన ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా మజ్లిస్ పార్టీ నేతలను అలాగే ఓవైసీ సోదరులు టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోంది. 


దీంతో కచ్చితంగా తమకు మైలేజ్ వస్తుందని బీజేపీ భావిస్తోంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ మరియు బాలాజీ నగర్ డివిజన్ లో అభ్యర్థుల తరపున ప్రచార కార్యక్రమంలో  బీజేపీ నాయకుడు రాజాసింగ్ పాల్గొన్నారు. పీవీ నరసింహారావు మరియు ఎన్టీఆర్ పై వ్యాఖ్యలు చేసిన ఓవైసీ సోదరులపై ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని రాజాసింగ్ ప్రశ్నించారు. ఒక్క సారి పువ్వు గుర్తుపై ఓటు వేస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం అని ఆయన అన్నారు. మతం పేరుతో రెచ్చగొట్టేలా ఎంఐఎం వ్యాఖ్యలు చేస్తోందని ఆయన అన్నారు. 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: