ఎన్నికలప్పుడు ఎప్పుడు చేసే విదంగా ఈ గ్రేటర్ ఎన్నికల్లోనూ మజ్లిస్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేయలేదు ..అందుకు గల కారణం ఏమిటంటే మజ్లిస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వదట .. అందుకే మేనిఫెస్టోని ప్రకటించకపోవడం విశేషం .. ఎన్నికల వేళా మజ్లిస్ పార్టీ విభిన్నంగా వ్యవహరిస్తోంది .. మేనిఫెస్టోని ప్రకటించకుండానే ముందుకు వెళ్తుంది .. ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంటింటికి వెళ్లి ప్రచారాలను చేస్తోంది ..
అంతేకాకుండా ఎన్నికల వేళా భారీ బహిరంగ సభలను నిర్వహిస్తోంది ..మజ్లిస్ అధినేతలు తమ ప్రసంగాలతో పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరుస్తున్నారు .. పార్టీ పని తీరునే ఆధారంగా చేసుకొని ఎన్నికల బరిలోకి దిగనుంది మజ్లీస్ పార్టీ .. దీనివల్ల అభ్యర్థులకు విజయం లభిస్తుందని పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది .. అభ్యర్థుల ఎంపికలో కూడా మజ్లీస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది ..
ఈ సారి మజ్లిస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో పోటీ చేయడం విశేషం .. కేవలం 51 డివిజన్లకు మాత్రమే పోటీ చేయనుంది .. గత గ్రేటర్ ఎన్నికలో మజ్లీస్ పార్టీ 61 డివిజన్లకు పోటీ చేసి అందులో 44 స్థానాలను దక్కించుకుంది ..