హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ సమయం దగ్గర పడింది మరో మూడు రోజుల్లో ఎన్నికలు ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు వీలైనంత ఎక్కువ ఇళ్ళను కవర్ చేసే పనిలో పడ్డారు. అయితే బంజారాహిల్స్ టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల్ విజయలక్ష్మి ఆమె అనుచరులు వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. గతంలో ఆమె సిట్టింగ్ కార్పొరేటర్ కావడంతో తాను చేసిన పనులను గుర్తు చేస్తూ ఇంతకు ముందు ఇక్కడ చెట్టు పడి పోతే చేయించాను, ఇక్కడ డ్రైనేజ్ కట్టించాను అంటూ అక్కడ స్థానికులకు చేసిన మంచి పనులు గుర్తు చేస్తూ ఆమె ప్రజల ముందుకు ళ్తున్నారు. 



ఈసారి కూడా గెలుపు తనదేనని చాలా చాలా ధీమాగా ఉన్నారు. ఆమె తరఫున ఆమె అనుచరులు సహచరులు కూడా వేర్వేరు బృందాలుగా ఏర్పడి తమ అభ్యర్ధి చేసిన మంచి పనులను ఆ జనానికి గుర్తు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆమె ఏమేం చేసిందో కరపత్రాలు కూడా ముద్రించి ఈ సారి ఎలా అయినా ఓటు వేయాలని అందరినీ అభ్యర్థిస్తూ ముందుకు వెళ్తున్నారు. 



టిఆర్ఎస్ తరఫున ఒక్కో డివిజన్ కు ఒక్కో ఎమ్మెల్యే స్థాయి నేతను పార్టీ కేటాయించింది. అభ్యర్థులతో పాటు వీరు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. తమ పార్టీకి ఓటు వేస్తే అధికారంలో ఉన్నది కాబట్టి కచ్చితంగా ఈ సారి మరిన్ని మంచి పనులు చేస్తానని చెబుతూ ప్రచారంలో ముందుకు వెళుతున్నారు నేతలు. అందుకు తగ్గట్టే భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా తానేం తక్కువ తినలేదని వారు కూడా ప్రచారాలు గట్టిగానే చేస్తున్నారు. చూడాలి చివరికి ఈ డివిజన్ ఎవరు గెలుస్తారు అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: