కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ రోడ్ no2 లో బీజేపీ, టీఆర్ఎస్ ర్యాలీలు ఎదురెదురయ్యాయి. పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల చొరవతో పార్టీల కార్యకర్తలలు వెనక్కి తగ్గారు. బీజేపీ ర్యాలీలో రాజా సింగ్ ఉండడంతో కలకలం రేగిందని చెప్పాలి. ఈ సందర్భంగా  రాజాసింగ్ మాట్లాడుతూ మా ర్యాలీలో కి కుక్కలు వచ్చాయని, కుక్కలు అరిస్తే పులి ఆగదని అన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ర్యాలీ లో గొడవ చేసే ప్రయత్నం చేశారు. ఏదో గొడవ చేయాలని చూస్తున్నారు. కార్యకర్తలంతా ఏకమై పార్టీని గెలిపించాలని అన్నారు. టీఆర్ఎస్ మాటల్లో దమ్ము లేదన్న  ఆయన ఆరేళ్లుగా అధికారంలో ఉన్న టీఆరెస్.. అభివృద్ధి చేయలేదని అన్నారు. 



కేంద్రం నిధులు ఇస్తోంది.. చెప్పడానికి టీఆరెస్ ఒప్పుకోవటం లేదని అన్నారు.  అయ్యా కొడుకు ఫోటోలు తప్ప హైదరాబాద్ లో ఎం లేవని ఆయన అన్నారు. అయ్యా కొడుకు, బిడ్డ , అల్లుడు.. తెలంగాణ ను సర్వ నాశనం చేస్తున్నారని రాజా సింగ్ అన్నారు. ఏమన్నా నిర్మించాలంటే లంచం ఇవ్వాలని అవినీతికి అడ్డాగా జీహెచ్ఎంసి మారిందని అన్నారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ పేరుతో దోచుకున్నారని మళ్ళీ టీఆర్ఎస్ గెలిస్తే ఈసారి బీఆర్ఎస్ పేరుతో దోచుకుంటారని అన్నారు.కేటీఆర్ ఏసీ కారు.. దిగి బైక్ పై ప్రయాణం చేయాలని ఆయన అన్నారు. 


 

బీజేపీ గెలిస్తే ప్రతి డబ్బాకు కరెంట్ ఉచితమని అన్నారు. పదివేల పేరుతో తమాషా చేశారన్న ఆయన మునిగిన వాళ్లకు డబ్బులు రాలేదని పార్టీ కార్యకర్తలకు డబ్బులు.. జానాన్ని మోసం చేస్తున్నారని అన్నారు. టీఆరెస్ నాయకులకు జనం చెప్పులు చూపెడుతున్నారు, మా చిన్న బామ్మర్దికి ఎం చెప్పరా..? అంటూ ఓవైసీ సోదరులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రెచ్చగొట్టే మాటలు ఎంఐఎం నాయకులకు చెప్పండి ! దమ్ముంటే సమాధులు ముట్టుకో..

సమాధులకు రక్షణగా మేముంటాం అంటూ ఆయన కామెంట్ చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: