ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యం లో తెలంగాణ రాజకీయాల్లో వేడి మరో సారి రాజుకుంది అన్న విషయం తెలిసిందే. అన్ని పార్టీలు జిహెచ్ఎంసి ఎన్నికల ను  ఎంతో ప్రతిష్టాత్మకం గా తీసుకున్నాయి... ఈ క్రమంలో నే ముమ్మర ప్రచారం చేపడుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రస్థాయి లో కసరత్తు కూడా చేస్తున్నాయి  అయితే జిహెచ్ఎంసి ఎన్నికల ను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది  అన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి ప్రతి చోట ఎదురుదెబ్బలు తగులుతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తుంది.



 ఈ క్రమంలోనే అన్ని డివిజన్లలో కూడా గెలుపు గుర్రాలను రంగంలోకి దింపిన కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రచారం నిర్వహిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న డివిజన్లలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయం తెలిసిందే. టిఆర్ఎస్ మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని తెలంగాణలో జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది అంటూ ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థులు చెబుతున్నారు తమకు ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం అంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.



 ఇక ఈ నేపథ్యంలోనే జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం లోని హబ్సిగూడ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉమా సుధాకర్ రెడ్డి ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.  ఇటీవలే డివిజన్ పరిధిలోని స్ట్రీట్ నెంబర్ 8 లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏఐసిసి కార్యదర్శి బోసు రాజు సహా మరికొంత మంది ముఖ్య నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: