గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ అన్ని ప్రధాన పార్టీలు తమ తమ పార్టీ మేనిఫెస్టో లను విడుదల చేస్తున్నారు. ఇక (AIMIM) ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తేహాద్-ఉల్-ముస్లిమీన్ పార్టీ విషయానికి వస్తే.. హైదరాబాద్ పాతబస్తీలోని రాజకీయాలను శాసించే ఈ పార్టీ మిగతా రాజకీయ పార్టీల్లా మాత్రం కాదు. జాతీయ స్థాయిలో విస్తరిస్తున్న ఇతర పార్టీలకీ దీనికి చాలా తేడాలు ఉన్నాయి. వీరు ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించరు. ఏ నిర్ణయమైనా పార్టీ అధినేతదే తుది నిర్ణయం. బుజ్జగింపులు, లీడర్ల తిరుగుబాట్లు, ఇతర సర్దుబాట్లు ఎక్కడా కనిపించవు. ఆ పార్టీ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఎవరికీ అంతు చిక్కవు.


ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం ఒక మోసమని, అది ప్రజల్ని మోసం చేసే పత్రమని మజ్లిస్ పార్టీ అభిప్రాయం. ఈ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదు. ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఎప్పటి మాదిరిగానే మజ్లిస్‌పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయలేదు. 2009 ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ యాక్షన్‌ ప్లాన్‌ పేరిట డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. 2002 లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో దివంగత నేత సలావుద్దీన్‌ హైదరాబాద్‌ యాక్షన్‌ ప్లాన్‌ పేరిటడాక్యుమెంట్‌ను విడుదల చేశారు.

ఇక అభ్యర్థుల ఎంపిక విషయంలో సైతం ఆచితూచి వ్యవహరిస్తారు. పాదయాత్రకు లేదా గడప గడపకు ప్రచారం చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పొద్దున, సాయంత్రం పాదయాత్రలే జరుగుతాయి. కేవలం రాత్రి వేళల్లో మాత్రమే బహిరంగ సభలు జరడం గమనించవచ్చు. ఈ సభల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌, మరో నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ తమ వాగ్ధాటితో ప్రజల్ని ఆకట్టుకుంటారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతారు. 2009 ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ యాక్షన్‌ ప్లాన్‌ పేరిట పార్టీ ఓ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. అంతకుముందు 2002 మున్సిపల్‌ ఎన్నికల్లో దివంగత నేత సలావుద్దీన్‌ హైదరాబాద్‌ యాక్షన్‌ ప్లాన్‌ పేరుతో ఓ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు.

ఎన్నికల్లో మజ్లిస్‌ పరిమితమైన స్థానాలకు మాత్రమే పోటీ చేస్తుంటుంది. ఈ సారి 51 డివిజన్లకు అభ్యర్థులను బరిలో దింపింది. గత ఎన్నికలోల 60 డివిజన్లకు పోటీ చేసి 44 స్థానాలను దక్కించుకుంది. అందులో సమారు 16 మంది సిట్టింగ్‌ కార్పొరేటర్‌లకు మళ్లీ టికెట్ ఇవ్వలేదు. అయినా వారిలో ఎలాంటి అసంతృప్తి, అలకలు లేకుండా చర్యలు తీసుకుంటారు. అసలు రెబెల్స్ అనే మాటే దాదాపు మజ్లిస్ పార్టీలో వినిపించదు. పార్టీ అధినేతదే తుది నిర్ణయంగా ఉంటుంది. ఈసారి జరగబోయే గ్రేటర్ ఎన్నికలు ఒకరకంగా మజ్లిస్ పార్టీకి కూడా చాలా ప్రతిష్టాత్మకమైనవే.

మరింత సమాచారం తెలుసుకోండి: