ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.  టీడీపీ మాజీ మంత్రి, కీలక సభ్యుడు, చంద్రబాబు బంటు కుడి భుజం అయిన అచ్చెం నాయుడు ఇటీవలే  ఈ ఎస్ ఐ స్కాం కేసులో జైలుకి వెళ్లి చాలారోజుల తర్వాత విడుదల అయిన సంగతి తెలిసిందే.. ఆంధ్రప్రదేశ్ లో కలవరం సృష్టించిన ఈ ఎస్ ఐ స్కాం లో ప్రధాన నిందితుడిగా భావించి అచ్చెన్న ను పోలీసులు అరెస్ట్ చేయగా పలుమార్లు బైలు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది..

ఎట్టకేలకు నిభంధనలతో కూడిన బెయిల్ ని ఇవ్వగా రాగానే ఈ పదవిని కట్టబెట్టం వెనుక చంద్రబాబు పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. ఇక అధ్యక్షడు అయినా తర్వాత అచ్చెన్న కొంత దూకుడు పెంచడాన్ని చెప్పొచ్చు.. పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.. కార్యకర్తల్లో కూడా ఉత్సాహం నింపడానికి ప్రయత్నిస్తున్నారు.. అధికారంలో ఉన్నప్పుడు ఎంత అన్యాయం చేసినా పట్టిన్చుకొని అచ్చెన్నా తమకు కొంత అన్యాయం జరిగే సరికి కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారు.

శాశ్వతంగా తామే అధికారంలో ఉంటాం, ఏపీ కి టీడీపీ తప్పా ఎవరు దిక్కు లేదు అన్నట్లు నేతలంతా ప్రవర్తించేవారు కానీ ఒక్కసారి గా వారి అంచనాలు తలకిందులు ఆయె సరికి వారి అంచనాలు ఆకాశం విడిచి నెల చేరాయి. అయన మాటల్లో క్షమాపణ భావం స్పష్టంగా కనిపిస్తుంది..   అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అంటున్నారు. ప్రజాస్వామ్యయుతంగా పనిచేయాలని కోరుతున్నారు. తమ పార్టీ నేతల మీద తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఇంతకు ఇంతా చక్రవడ్డీలతో సహా చెల్లించి తీరుతామని భీకర గర్జనలే చేస్తున్నారు.నిజమే అధికారం ఎవరికీ శాశ్వతం కాదు కానీ మరి నాడు విర్రవీగింది ఎవరు, తప్పుడు కేసులు పెట్టింది ఎవరు,  గెలిచిన ఎమ్మెల్యేలు ఉండగా వారిని కాదని ఓడిన వారిని ఇంచార్జిలుగా చేసింది ఎవరు, ఇవన్నీ సీనియర్ నేతలుగా ఉన్న అచ్చెన్న లాంటి వారు ఆలోచించుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: