రాష్ట్రంలో ని విశాఖ నగరంలో జరుగుతున్న రాజకీయ దాడుల గురించి అందరికి తెలిసిందే.. ప్రతి వారం అక్కడ ఓ సెన్సేషన్ జరుగుతుంది. జగన్ ప్రభుత్వం అవినీతి కోరల్లో ఉన్న నేతలను జైలుకి పంపడం అనే నెపంతో, అక్రమాస్తుల దురాక్రమణ పేరు తో తమకు అడ్డొస్తున్న టీడీపీ నేతల భరతం పడుతుంది. రాష్ట్రంలోని అందరు టీడీపీ నేతలు, వైసీపీ నేతలు ఎంతో హాయిగా ఉంటున్నారు కానీ విశాఖ లోని టీడీపీ నేతలు మాత్రం ఈరోజు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలీక దినదినగండంగా గడుపుతున్నారు..

గతంలో రాజధాని విషయంలో సపోర్ట్ లేక విశాఖ నేతలు సతమతమయ్యారు.. ఇప్పుడు ఈ దాడులతో వారిలో చావ చచ్చినట్లు కనిపిస్తుంది..నిజానికి వైసీపీ అధికారంలోకి రావడం పై వారికి ఏమాత్రం అభిప్రాయ తేడాలు లేవు.. ఎందుకంటే ఒకరోజు ఒక పార్టీ లొ ఉంటుంది, ఇంకో రోజు ఇంకో పార్టీ అధికారంలో ఉంటుంది.. అయితే వీరి పరిస్థితి ఎలా ఉందంటే కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు ఉంది.. రాజధాని కి నో అంటే ప్రజలు, ఎస్ అంటే పార్టీ వారిని దూరం పెట్టేవారు.. ఈ తరహా వైఖరి తో వారు వారి రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకంలో ఉంచారు.

ఇవన్నీ చూసి మరో టీడీపీ నేత గంటా శ్రీనివాస్ రావు త్వరలోనే వైసీపీ పై బరస్ట్ అయ్యేలా ఉన్నారని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు స్వభావం తెలిసిన వారు ఎవరూ ఆయన బరస్ట్ అయి వీధుల్లోకి వస్తారని అనుకోరు. అందునా వైసీపీ అత్యంత బలంగా ఉన్న కాలమిది. ఆదుకునేందుకు కూడా ఎవరూ లేరు, రారు, అందుకే ఆయన మౌనమే నా భాష అంటున్నారు. అయితే సహనానికి కూడా హద్దు ఉంటుంది కదా. గంటా శ్రీనివాసరావుతో సహా అనుచరులను ఒక్కొక్కరినీ పట్టుకుని మరీ టార్గెట్ చేస్తూంటే ఊరుకోగలరా. మరి దీన్ని గంటా ఎలా ఆపుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: