ఏపీ సర్కార్ అవినీతి కార్యక్రమాల విషయంలో టీడీపీ నేతలు కాస్త ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. రాజకీయ అంశాలను ప్రధానంగా చేసుకుని ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఇక అవినీతిని ఎక్కువగా బయటపెడుతున్నారు. తాజాగా శాసన మండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ పేదల రక్తాన్ని జలగ పీల్చినట్లు పీల్చేస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి రావాల్సిన రాబడి  మొత్తం జే గ్యాంగ్ జేబుల్లోకి పోతోంది అని ఆయన అన్నారు.

పేదలపై యధేచ్చగా పన్నుల మోత, సుంకాల భారం మోపుతున్నారు అని ఆయన విమర్శించారు. ఏడాదిన్నరలోనే పన్నులు, ఛార్జీల పెంపు ద్వారా రూ70వేల కోట్ల భారాలు మోపారు అని మండిపడ్డారు. పట్టణ భూముల విలువ పెంపుతో ప్రజలపై రూ.800కోట్ల భారం పడనుంది అని అన్నారు. ఆస్తిపన్ను 15శాతం పెంపుతో రూ.8వేల కోట్ల భారం పడుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎన్జీపై 10శాతం వ్యాట్ పెంచి రూ.300కోట్ల భారం మోపారు అని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఇష్టానుసారం పెంచి 1800కోట్ల భారం వేశారు అని విమర్శించారు.

దొడ్డిదారిన విద్యుల్ బిల్లులు పెంచి 3వేల కోట్ల భారం మోపారు అన్నారు. యూజర్ ఛార్జీల పెంపుతో రూ.2400కోట్ల భారం మోపారు అని, రవాణా పన్నులు పెంపుతో  రూ.400కోట్ల భారం మోపారు అని విమర్శించారు. నిత్యావసరాల ధరలు 200% నుంచి 300% పెంచేశారు అని మండిపడ్డారు. మద్యం రేట్లు 200%, 300%  పెంచారు, రూ 9వేల కోట్ల భారం మోపారు అని విమర్శలు చేసారు. ఇసుక దోపిడిలో జె గ్యాంగ్ రూ 18వేల కోట్లు కొల్లగొట్టారు అన్నారు. మద్యం మాఫియాతో రూ 25వేల కోట్ల దోపిడి అని వ్యాఖ్యానించారు. మైనింగ్ మాఫియాతో రూ 30వేల కోట్ల దోపిడి జరుగుతుంది అన్నారు. సిమెంట్ సిండికేట్ తో రూ 15వేల కోట్ల దోపిడి జరుగుతుంది అని విమర్శించారు. ఇళ్లస్థలాలకు భూసేకరణలో రూ4వేల కోట్ల దోపిడి జరిగింది అన్నారు.  ల్యాండ్ లెవలింగ్ ముసుగులో మరో రూ2వేల కోట్ల దోపిడి చేసారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: