వివరాల్లోకి వెళితే.. బీహార్లో పూర్నియా సెంట్రల్ జైలులో మొట్టమొదటిసారిగా జైలు అధికారులు ఏటీఎం ఏర్పాటు చేశారు.
ఖైదీలు వారి రోజువారీ అవసరాల కోసం డబ్బును విత్డ్రా చేసుకోవడానికి జైలు ప్రాంగణంలో ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఖైదీలతో పాటు వారి కోసం వచ్చినవారు కూడా దీని ద్వారా డబ్బును డ్రా చేసుకునేందుకు ఈ ఏటీఎం అనువుగా ఉంటుంది.
జైలులోని ఖైదీలు రోజుకు 4 నుంచి 8 గంటలు చేస్తారు. అందుకు గానూ వారికి
రోజుకు 52 రూపాయల నుంచి 103 రూపాయల దాకా వేతనం చెల్లిస్తున్నారు.
జైలులోని చిన్న, కుటీర పరిశ్రమల్లో పనిచేసిన ఖైదీలకు వేతనాలను వారి
బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఖైదీలు జైలులో ఫేస్ మాస్కులు తయారు చేస్తున్నారు.
దీనిపై పూర్నియా జైలు సూపరింటెండెంట్ జితేంద్రకుమార్ మాట్లాడుతూ, జైలు
మాన్యువల్ ప్రకారం ఒక్కో ఖైదీ 500రూపాయల నగదును డ్రా చేసి ఉంచుకునేందుకు అనుమతి ఉంది. ఖైదీలు వారి వేతనాల డబ్బు నుంచి సబ్బులు, హెయిర్ ఆయిల్, తినేందుకు చిరుతిళ్ల కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చని జితేంద్ర కుమార్ చెప్పారు.
పూర్నియా జైలులో 750 మంది ఖైదీలుండగా వారిలో 600 మంది ఖైదీలకు బ్యాంకులో ఖాతాలున్నాయి. వీరిలో 400మందికి ఏటీఎం కార్డులను జారీ చేశామని, మిగిలిన వారికి కూడా త్వరలో అందజేస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. ఏది ఏమైనా సెంట్రల్ జైల్లో ఏటీఎం ఏర్పాడు చేయడం గొప్ప విషయంగానే చెప్పుకొవచ్చు.