గ్రేటర్
హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం సాగుతోంది.
డిసెంబర్ 1న పోలింగ్ జరుగనుంది. దీంతో ప్రచారం జోరుగా సాగుతోంది. ఆదివారం తో ప్రచారం ముగియనుంది.
బీజేపీ సైతం అన్ని జిల్లాల నాయకులు, కార్యకర్తలతో ఇంటింటా ప్రచారం చేస్తోంది. ఎంపీలు బండి సంజయ్, ఆర్వింద్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. వీరితోపాటు జాతీయ స్థాయి నాయకులను ప్రచార రంగంలోకి దింపింది.
పార్టీ జాతీయ అధ్యక్షుడు పడ్డా శుక్రవారం ప్రచారం చేయగా శనివారం
యోగి ఆదిత్యనాథ్ రానున్నారు.
అమిత్ షా కూడా ప్రచారానికి రానున్నారు.అన్ని డివిజన్లలో కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. ఉత్తమ్
కుమార్ రెడ్డి తోపాటు
రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహిస్తున్నారు. కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు.