ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ భయంకరమైన నివర్ తుఫాన్ ప్రభావంతో మూడు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లగా.. పలు చోట్ల రహదారులు, వంతెనలకు గండ్లు పడ్డాయి. స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోగా.. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలు, వరదలకు చిత్తూరు జిల్లాలో నలుగురు మృతి చెందగా.. కడప జిల్లాలో ఇద్దరు గల్లంతయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 2.18 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ అంచనా వేస్తోంది.


ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గౌరవ  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ గారు  చిత్తూరు జిల్లాను చూసేందుకు  పర్యటనకు వెళ్లారు. నివర్ తుఫాన్ ప్రభావంతో వణికిపోయిన చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలను సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. శనివారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం.. ఉదయం 9.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయంకు చేరుకుని.. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష నిర్వహించడం జరిగింది. అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి.. 10 నుంచి 11.30 గంటల వరకు తుఫాను కారణంగా మూడు జిల్లాల్లో జరిగిన భారీ నష్టాన్ని ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు జగన్ . అనంతరం సీఎం మధ్యాహ్నం 2.05 గంటలకు తాడేపల్లి చేరుకున్నారు. వర్షాలు ఎక్కువుగా వున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా వుండాలని ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు మంచిగా  సూచించారు. తుఫాను తగ్గేవరకూ ఇంట్లోనే జాగ్రత్తగా వుండాలని చెప్పారు.ఇలాంటి మరెన్నో అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: