హైదరాబాద్: మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నేతలపై కేసులు పెడతామని రెండు రోజుల క్రితం డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.


ఎర్రగడ్డ డివిజన్ లో ప్రచారం నిర్వహించిన బండి సంజయ్ ఎంఐఎం ఆఫీసు దారుస్సలాం ను నేలమట్టం చేస్తామని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన పై ఐపీసీ 505 కింద ఎస్.ఆర్.నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పీవీ.నరసింహారావు, ఎన్టీ రామారావు సమాధలను కూల్చివేస్తామని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఒక ప్రచార సభలో హెచ్చరించారు.


ఈ వ్యాఖ్యలపై బండి సంజయ్ అంతే స్థాయిలో స్పందించారు. అక్బర్ నీకు దమ్ముంటే ఇద్దరి నాయకులు సమాధులు కూల్చేయి… ఆ తరువాత మా కార్యకర్తలు దారుస్సలాం ను క్షణాల్లో నేలమట్టం చేస్తారని సంజయ్ ఘాటుగా హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: