హైదరాబాద్: ఇవాళ భారత ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో.. తనని ఆహ్వానించకపోవడం పట్ల కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా.. పలు విమర్శలు చేశారు. ఇవాళ మోదీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ ను పరిశీలించనున్నారు.


వ్యాక్సిన్‌ అభివృద్ధిపై సమీక్షించనున్న విషయం తెలిసిందే. ఇందుకు గానూ హకీంపేట ఏఎఫ్ఎస్‌లో ఆయన ల్యాండ్ అవుతారు. మోదీ పర్యటింటే రెండు ప్రాంతాలూ మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోకే వస్తాయి. అలాంటప్పుడు ఆ నియోజకవర్గ ఎంపీని ఆహ్వానించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: