హైదరాబాద్ ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుండగా అన్ని పార్టీలు ప్రచారం వేగవంతం చేశాయి.ముక్యంగా హైదరాబాద్ మేయర్ సీటు సాధించాలని ప్రయతిస్తున్న భాజపా కేంద్ర అగ్రనేతలను రంగం లోకి దింపింది. ఈ రోజు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ బేగంపేట విమానశ్రయానికి చేరుకొని అక్కడ నుండి జీడిమెట్ల చేరుకొని ప్రచారశంఖం పూరించారు.తరువాత కూకట్ పల్లి లో ప్రచారం నిర్వహించనున్నారు.

కూకట్ పల్లి ముళ్ళపూడి కమాన్ నుండి అల్విన్ ప్రధాన కూడలి వరకు ఈ రోడ్ షో జరగనుంది. దేశం లో భాజపా అధికారంలోకి వచ్చినప్పుడు నుండి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి వివరించనున్నారు. ఆలాగే భాజపా అభ్యర్థులను గెలిపించాలని ఒక్కసారి భాజపా కి అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. మరియు రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా  ప్రచారం కోసము హైదరాబాద్ రానున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: