హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నిర్వహించిన భారీ సభలో తెరాస మంత్రి తలసాని మాట్లాడుతూ మొదటి సారి నిర్వహించిన హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో తెరాస 99 సీట్లు గెలిచిందని ఇప్పుడు నిర్వహించే ఎన్నికల్లో 104 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


 అలాగే వరదల సమయంలో, కరోనా సమయంలో తెరాస ప్రజలను ఆదుకుందని తెరాస కు మరో అవకాశం ఇవ్వాలని కోరారు.వెనుకబడిన తరగతి ప్రజల అభివృధే సీఎం కేసీఆర్ లక్ష్యం అని ఆయన అన్నారు.కేంద్రం లో భాజాపా అధికారలో ఉన్నపటికీ తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమి లేదు అని అన్నారు.అలాగే కేంద్రం హైదరాబాద్ నగర అభివృద్ధి కి ఏమి చేసిందో చెప్పాలని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: