గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు బిజెపి నేతలు దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. రాజకీయంగా  ఇప్పుడు తెరాస పార్టీని ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా కూడా దూకుడుగా వెళ్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక గోషా మహల్ ఎమ్మెల్యే రాజసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది అది ఓటర్ నిర్ణయం అన్నారు. గతంలో ఎలాంటి దుస్థితి ఉందొ ఇప్పటికే అదే తరహ పాత పట్నం ల ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రతి ఒక్క ఓటర్ మేల్కోవాలి అని ఆయన పిలుపునిచ్చారు. తండ్రి, కొడుకుల రాజ్యం తెలంగాణ లో నడుస్తుంది అని మండిపడ్డారు. సిటీలో ఎక్కడ చూసినా అయ్యా కొడుకుల ప్లెక్సీ లు దర్శనం ఇస్తున్నాయి అని ఆయన వ్యాఖ్యలు చేసారు. బీజేపీ కమ్యూనల్ గొడవలు చేస్తది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. ఓల్డ్ సిటీ లో అభివృద్ధి ఉంది అని మజ్లీస్ అంటుంది అని ఎక్కడ ఉంది అభివృద్ధి అన్ని ఆయన నిలదీశారు. చిన్న చినుకు పడితే ఓల్డ్ సిటీ ఆగం ఐతుంది అన్నారు.

ఓల్డ్ సిటీలో మానవ అక్రమ రవాణా జరిగినా వాళ్ళను పట్టించుకునే నాథుడు లేడు అని ఆయన మండిపడ్డారు. కానీ బీజేపీ వాళ్లకు అండగా ఉంటది అన్నారు. 10 వేల రూపాయల పేరుతో ముస్లిం సోదరులను మజ్లీస్ మోసం చేసింది అని ఆయన విమర్శలు చేసారు. ఎన్నికల్లోమజ్లీస్ కార్యకర్తలు ఓట్లు అడిగితే ముస్లిం మహిళలు చెప్పు చూపిస్తున్నారు అన్నారు. కేసీఆర్ మజ్లీస్ కలసి జనాలను మోసం చేస్తున్నారు అని ఆయన విమర్శలు చేసారు. మీ పిల్లలు విద్యావంతులు కావాలంటే బీజేపీ కి ఓటు వెయ్యండి అన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే అదే పార్టీతో మజ్లీస్ జతకడ్తది అని ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: