హైదరాబాద్: హైదరాబాద్ను భాగ్యనగరంగా మార్చే
శక్తి బీజేపీకే ఉందని
యూపీ సీఎం
యోగి ఆదిత్యనాథ్ అన్నారు. శనివారం కూకట్పల్లిలో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా
యోగి ప్రసంగించారు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతం ఎంఐఎం నేతల కబ్జాలో ఉందని విమర్శించారు.
అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న నిజాం వారసులకు బుద్ధి చెప్పాలని, హైదరాబాద్ను ఓ కుటుంబం దోచుకోవాలని చూస్తోందని వారికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. యూపీలో 30 లక్షల మందికి ఇళ్లు కట్టించామని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరేళ్లలో ఎంత మందికి ఇళ్లు కట్టించిందో చెప్పాలని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ నాయకులు గత హామీలను నెరవేర్చలేదు.. కొత్త హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. భాగ్యనగర అభివృద్ధి బీజేపీకే సాధ్యమవుతుందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీనే గెలిపించాలని తెలిపారు