దోపిడీలు,దారుణాలు నిన్న మొన్నటి వరకు ప్రజలను భయ బ్రాంతులకు గురిచేశాయి.. కానీ ఇప్పుడు మాత్రం వ్యభిచారం పడగలు విప్పు తుంది.. జంట నగరాల్లోని యువతను టార్గెట్ చేస్తూ అమ్మాయిలతో సెక్స్ రాకెట్ ను నడిపిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పోలీసులు వ్యభిచార గృహాల పై దాడులు నిర్వహిస్తున్నారు.. ఎక్కడిక్కడ అదుపు చేస్తున్నా కూడా కొత్త మార్గాలను ఎంచుకుంటూ రెచ్చిపోతున్నారు.. అన్నిటికన్నా ముఖ్యంగా వ్యభిచార గృహాలు పుట్టుకొస్తున్నాయి. ఆంధ్రాలో పేరు మోసిన జిల్లాల్లో ఈ వ్యభిచారాలు ఎక్కువ అవుతున్నాయి. 



ఈ నేపథ్యంలో ఉద్యోగాలు లేని అమ్మాయిలకు, ఆర్ధిక పరిస్థితులు బాగలేని అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి  బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టేస్తున్నారు.. వారి శరీరంపై డబ్బులు సంపాదిస్తున్నారు.. డబ్బులు ఎక్కువ అడిగితే మాత్రం వారికి నానా హింసలు పెడుతున్నారు. కొందరు అయితే ఏకంగా చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల చాలా జరిగాయి. ఫారిన్  యువతులతో కొందరు ఈ వ్యాపారం చేస్తే.. మరి కొందరు ఇక్కడి అమ్మాయిలను  బలవంతంగా ఈ ఉచ్చులోకి లాగుతున్నారు. 



ఏపి లో ముఖ్యంగా వ్యభిచారం విచ్చల విడిగా జరుగుతున్న జిల్లాల విషయానికొస్తే.. విశాఖ, వైజాగ్, విజయవాడ, శ్రీకాకులం, నెల్లూరు జిల్లాల్లో వ్యభిచార గృహాలు విధీకి ఒకటి దర్శన మిస్తున్నాయి.. యువకులను ఆకట్టుకోవడానికి  ఆన్ లైన్ ను మార్గంగా చేసుకుంటున్నారు.. అందుకోసం ప్రత్యేక వెబ్ సైట్లను అందుబాటులో ఉంచుతున్నారు.. ఇంకా చెప్పాలంటే వారికి రాను పోను ట్రావెల్ కూడా అరెంజ్ చేస్తున్నారు.. కష్ట మర్లు నేరుగా ఇళ్లకే అమ్మాయిలను తెచ్చుకొని ఏదో కొంత వారికి ఇచ్చి పంపిస్తున్నారు. ఇప్పటివరకు ఆ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం బయట పడలేదు.. ఇటీవల వైజాగ్ దివ్య హత్య కేసు మరువక ముందే మరో ఇద్దరు యువతులు కూడా ప్రాణాలను కోల్పోయారు. ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలను తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: