గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ హైదరబాద్ లో వరదలు చూసి చేలించిపోయాను అన్నారు.ప్రజలు పడుతున్న బాధలు చూడలేకపోయానన్నారు అందుకే వెంటనే వరద సాయాన్ని ప్రకటించానని తెలిపారు.అయితే ఈ లోపల ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆగిపోవడం జరిగిందని ఎన్నికలు పూర్తయిన తరువాత డిసెంబర్ 7 నుంచే మళ్లీ వరదసాయం అందిస్తామని చెప్పారు.
లక్షల మంది పేదల బతుకులు ఆగమవడం చూసి చాలా బాధపడ్డానని కేసిఆర్ అన్నారు.కేంద్రం నుండి ఎలాంటి సాయం అందకున్న కానీ, దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు సాయం అందజేశామని కేసిఆర్ స్పస్టం చేశారు.. గ్రేటర్ ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ పోతుంది.. ఆ తర్వాత డిసెంబర్ 7వ తేదీ తర్వాత వరద సాయం అందని వారికి అందిస్తాం అని కేసిఆర్ గారు ఎన్నికల ప్రచార బహిరంగ సభలో స్పస్టం చేశారు.