ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..జగన్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున రీయింబర్స్‌మెంట్‌ నిమిత్తం రూ.2,234.288 కోట్లను మంజూరు చేసింది. ఈ సందర్బంగా నాబార్డు డీజీఎం వికాశ్‌ భట్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక్కడ జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ  ఇంకా  పోలవరం ప్రాజెక్టు అథారిటీ  ద్వారా నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోతుంది. వచ్చే నెల అనగా డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఇవి జమ అవుతాయని తెలుస్తుంది.. రూ.2,234.288 కోట్ల రీయింబర్స్‌మెంట్‌ కోసం కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జల్‌ శక్తి శాఖ ప్రతిపాదనలు పంపింది.


ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే వరకు.. అంటే 2016 సెప్టెంబర్‌ 8 వరకు పోలవరానికి కేంద్రం బడ్జెట్‌లో నిధులు కేటాయించి విడుదల చేసేది. దాని తర్వాత  నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే సమయంలో నాబార్డు నుంచి రుణం తీసుకుని పోలవరానికి నిధులిస్తామని మలుపు  ఇచ్చారు. అప్పటినుంచి అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్‌ చేస్తూ వస్తోంది.


పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు రాష్ట్ర ప్రభుత్వం రూ.4,730.71 కోట్లను ఖర్చు చేసింది. విభజన చట్టం ప్రకారం 2014 ఏప్రిల్‌ 1 తర్వాత ప్రాజెక్టు నీటిపారుదల విభాగానికయ్యే వంద శాతం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే  భరించాలి. 2014 ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12,529.42 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రూ.8,614.16 కోట్లను నాబార్డు రీయింబర్స్‌ చేస్తూ ఎన్‌డబ్ల్యూడీఏ, పీపీఏలకు విడుదల చేసింది. అందులో పీపీఏ రూ.8,507.26 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది.


మిగతా రూ.4,022.16 కోట్లను రీయింబర్స్‌ చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇందులో రూ.2,234.288 కోట్లను రీయింబర్స్‌ చేయాలని నాబార్డును కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించిందని స్పష్టం అయ్యింది. ఇలాంటి కష్ట కాలంలో ఈ నిధుల విడుదల భారీ ఊరటగానే చెప్పాలి.ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: