ప్రస్తుతం మానవ సంబంధాలకు పెద్దగా విలువ లేకుండా పోయింది..కేవలం అవసరాలకు మాత్రం సంబంధాలను కొనసాగిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాలంటే శారీరక సంబంధాలు. ఈ బంధాల మోజులో పడి అయిన వారిని, కుటుంబాన్ని గాలికి వదిలేసి వెళ్ళిపోతున్నారు కొందరు.. మరికొందరు ఆ సుఖాలకు అడ్డువస్తున్న సొంతవాల్లను అతి దారుణంగా కడతెరుస్తున్నారు.. ఇప్పుడు ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ వేరే మహిళతో సంబంధం పెట్టుకుంది. అయితే తన కన్న కొడుకు అడ్డువస్తున్నాడని అతి కిరాతకంగా చంపి , ముక్కలు చేసింది..



ఈ దారుణ ఘటన బ్రెజిల్‌ దేశంలో జరిగింది.సమాంబియా అడ్మినిస్ట్రేటివ్ రీజయన్‌కి చెందిన రొసానా క్యాండిడో కి తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నాడు. భర్త కుటుంబంపై ద్వేషంతో ఆమె తన లేడీ ప్రియురాలు కాసిలా పెస్సోవా తో కలసి ఉంటోంది. కొడుకుపై విపరీతమైన ద్వేషం పెంచుకున్న క్యాండిడో అత్యంత కిరాతకానికి పాల్పడింది. గాఢ నిద్రలో ఉన్న పిల్లాడి పై పాశవికంగా ప్రవర్తించింది. కత్తి తీసుకొని గుండెల్లో పొడిచింది. తన ప్రియురాలు పెస్సోవా బాలుడి మృతదేహాన్ని కిందపడేయడంతో 11 సార్లు కిరాతకంగా పొడిచేసింది.



ఆ తర్వాత ఘోరానికి ఒడిగట్టారు.. తన కొడుకు చర్మాన్ని ఒలిచి, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసారు..బార్బెక్యూపై మాంసాన్ని తగలబెట్టారు. మిగిలిన అవశేషాలను ఓ సూట్‌కేసులో వేసుకుని దూరంగా తీసుకొచ్చి పడేశారు. క్యాండిడో సూట్‌కేసును విసిరేయడం ఇద్దరు ప్రత్యక్ష సాక్ష్యులు గమనించారు. వారిలో ఒకరు సూట్‌కేసులో ఏముందోనన్న ఉత్సాహంతో తెరచి చూసి షాక్‌కి గురయ్యారు. మనిషి అవశేషాలు చూసి బిత్తరపోయి పోలీసులకు చెప్పారు.. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నేరాన్ని సీరియస్‌గా పరిగణించిన న్యాయస్థానం ఇద్దరికీ కఠిన శిక్షలు విధించింది. తల్లి క్యాండిడోకి 65 ఏళ్ల జైలు శిక్ష, ఆమె ప్రియురాలు పెస్సోవాకి 64 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. పోలీసు విచారణలో క్యాండిడో షాకింగ్ విషయాలు వెల్లడించింది.. భర్త మీద దేశంలోనే ఇలా చేసిందని చెప్పుకొచ్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి: