దేశంలో క్రైమ్ రేట్ రోజురోజుకు క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది. ఇక సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఒక్కరిపై మరొక్కరు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ ఒక్కరిపై మరొక్కరు హత్యలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక్కరి చేతిలో మరొక్కరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. బీహార్‌లో మరోసారి దుండగులు రెచ్చిపోయారు. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఇవాళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గోపాల్‌గంజ్ జిల్లాలో జేడీయూ ఎమ్మెల్యే అమరీందర్ కుమార్ పాండే అనుచరులపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఓ అనుచరుడు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, కాల్పుల తర్వాత గ్రామస్తులు నిందితుల్లో ఇద్దర్ని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అరెస్ట్ చేశారు.

ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్‌పూర్ పోలీస్టేషన్ పరిధిలోని రాజ్పూర్ బజార్‌లో ఎమ్మెల్యే అనుచరుడు దేవేంద్ర పాండే తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ దుకాణం వద్ద టీ తాగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు మోటార్ బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు.. వచ్చీ రాగానే విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దేవేంద్ర పాండే ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటీన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: