డాక్టర్లతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో బండి సంజయ్ పాతబస్తీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరున్నర ఏళ్లలో రెండున్నర లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిందన్న ఆయన పది వేల రూపాయల పేరుతో దోచుకున్నారని అన్నారు. నా సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆయన అన్నారు. హైదరాబాద్ లో బంగ్లాదేశ్ బస్తీలు.. చోటా పాకిస్తాన్ పేర్లు పెడితే ఎట్లా ఒప్పుకుంటారు అని అయన ప్రశ్నించారు. మూసి లో కొబ్బరి నీళ్లు తాగాకే, టీఆర్ఎస్ కు ఓట్లు వెయ్యాలని ఆయన అన్నారు. ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణా లో ఎందుకు అమలు చెయ్యరని ప్రశ్నించిన అయన హైదరాబాద్ ప్రజలకు భరోసా ఇచ్చేందుకు.. కేంద్ర నాయకులు వస్తున్నారని ఆయన అన్నారు. 


ఉస్మానియా యూనివర్సిటీ పాకిస్తాన్ లో ఉందా.. బంగ్లాదేశ్ లో ఉందా ? అని ప్రశ్నించారు. ఎంఐఎం తెలంగాణ రాష్ట్ర విభజనకు వ్యతిరేకం అని చెప్పిందని అలాంటి పార్టీతో కేసీఆర్ కలిశాడని అన్నారు. కేసీఆర్ ఏ హిందువు.. ఎంఐఎం తో దోస్తీ చేసే వారు.. హిందువా ? అని ఆయన ప్రశ్నించారు. యాగాలు కొడుకును సీఎం చేసేందుకేనన్న సంజయ్ ఎంఐఎం ను కూకటి వేళ్ళతో అణిచి వేస్తామని అన్నారు. సీఎం నోరు తెరిస్తే అబద్ధాలు ఓట్లు సీట్లు కాదు.. భాగ్య నగరాన్ని కాపాడాలనే తపన మాది అని అయన అన్నారు. భాగ్య నగరానికి రక్షణ కవచం బిజెపి అని ఆయన అన్నారు. 


అసలు పాతబస్తీలో హిందువుల జనాభా ఎందుకు తగ్గుతోంది? అని ప్రశ్నించిన ఆయన శాలిబండ, అలియాబాద్, ఉప్పుగూడ, లాల్దర్వాజ గౌలిపుర,  చాతార్నాకా వంటి ప్రాంతాల్లో ఉన్న హిందువులు ఎక్కడకి పోయారు? అని ప్రశ్నించారు. హిందువుల ఆస్తులు ఎవరు ధ్వంసం చేశారు? ఎవరు కబ్జా చేశారు? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీని గెలిపించండి.  పోలీసులకు 15 నిమిషాలు స్వేచ్ఛను ఇస్తాం  పాకిస్థాన్ కుక్కలను, బాంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్ రోహింగ్యా లుచ్చాలను బయటకు గుంజి  తరిమేస్తాం అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: