డాక్టర్ల తో సమావేశం అయిన బిజిపి రాష్ట్ర  అధ్యక్షుడు సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అన్ని వ్యాధులకు మందు డాక్టర్లు ఇస్తున్నారు అన్ని ఆయన వ్యాఖ్యలు చేసారు. కానీ సామాజానికి అవినీతి రోగం పట్టింది.. దానికి మందు మేం పెడతాం అన్నారు. నా భాషకు గురువు కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన బాటలో పోతున్నా అన్నారు. అవినీతి, అహంకారం నాకు లేదు అన్నారు. మేనిఫెస్టో ఎం చెప్పారు.. ఎం చేశారు అని ఆయన నిలదీశారు. ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శలు చేసారు. బిజెపిని చూసి కేసీఆర్ డిప్రెషన్ లోకి పోయారు అన్నారు.

బహిరంగ సభలో ఎం మాట్లాడారో అర్ధం కావటం లేదు అని ఆయన విమర్శించారు. ఇతర సీఎం లను ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. జండూ బాం తో జనం సిద్ధంగా ఉన్నారు అని, దేశం కోసం ఎవరూ త్యాగం చెయ్యలేరు.. బిజెపి నేతలు త్యాగం చేశారు అన్నారు. పాకిస్తాన్, బాంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు.. హైదరాబాద్ నడి బొడ్డున ఉన్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. గతంలో జితేందర్ రెడ్డిని దారుణంగా చంపారు అని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంభం ఎం త్యాగం చేసింది అని నిలదీశారు.

సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగం చేసిన పార్టీ నేతలు బీజేపీలో ఉన్నారు అని ఆయన వెల్లడించారు. 370 ఆర్టికల్ కోసం ఎందరో బలిదానం అయ్యారు అని, జమ్మూ లో తల్లిదండ్రుల ముందు బిడ్డలను చంపారు అన్నారు. హైదరాబాద్ ప్రశాంతంగా లేదు అని, రోహింగ్యాలు హైదరాబాద్ లో ఉన్నారు.. వాళ్ళకు షెల్టర్లు ఏర్పాటు చేసింది తెరాస సర్కార్ అని ఆయన మండిపడ్డారు. ఎంఐఎం ను టీఆరెస్ పెంచి పోషిస్తోంది అన్నారు. ఎంఐఎం ను కఠినంగా అణిగి పెట్టె దమ్ము ధైర్యం లేదు అని, దమ్మున్న వ్యక్తి దేశ ప్రధాని అని ఆయన వ్యాఖ్యలు చేసారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత, విధ్వంసo జరిగిందా అని నిలదీశారు. ప్రజల్లో విద్వంసకారులు లేరు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: