ఇందులో అత్యుత్తమ మెరుగైన పెద్ద రాష్ట్రాల విభాగంలో ఆర్థిక రంగం, పర్యాటక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. అప్పుడు అప్పులు బాగా ఎక్కువగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేశారు .కాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైలెంట్గానే మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఆర్థికాభివృద్ధి, పర్యాటక రంగాల్లో ఏపీ టాప్ ర్యాంకును పొందగా, మోస్ట్ ఇంప్రూవ్డ్ కేటగిరిలో రెండో స్థానంలో నిలిచింది. 2018 లో టీడీపీ అధికారంలో వున్నప్పుడు పలు విభాగాల్లో ఎనిమిదో స్థానంలో ఉన్న ఏపీ.. జగన్ సీఎం అయిన ఏడాదికే రెండో స్థానానికి చేరడం గమనార్హం. 2020 ర్యాంకుల్లోనే ఏపీ తన స్థానాన్ని నిలబెట్టుకోవడంతోపాటు ఆర్థికాభివృద్ధిలో టాప్కు చేరింది.
ఇక ఓవరాల్ గా బాగా అభివృద్ధి చెందిన పెద్ద రాష్ట్రాల ర్యాంకుల్లో తెలంగాణ ఒక ర్యాంకు కిందికి దిగజారింది. 2019లో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు 10వ స్థానంలో నిలిచింది. అయితే, ఓవరాల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ పెద్ద రాష్ట్రాల విభాగంలో ఏపీ 7వ స్థానం , తెలంగాణ 9 స్థానంలో స్థానంలో నిలిచాయి. ఇక ప్రతిష్టాత్మక ‘స్టేట్ ఆఫ్ ది స్టేట్స్’ అధ్యయనంలో ఆర్థికాభివృద్ధి విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఏకంగా టాప్ ర్యాంకును సొంతం చేసుకుంది. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఓవరాల్ మోస్ట్ ఇంప్రూవ్డ్ రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...