జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల ప్రచారంకు ఇవాళ చివరి రోజు కావడంతో ప్రదాన పార్టీలు సుడిగాలి పర్యటనలు చేశాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా టి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్ గారు సనత్ నగర్, సికింద్రాబాద్ ,శాంతి నగర్, డివిజన్ లలో పర్యటించారు. ఆయన ప్రసంగిస్తూ బి‌జే‌పి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

డిల్లీ నుండి ఎంత మంది బి‌జే‌పి నేతలు వచ్చిన సింహం సింగిల్ గానే వస్తుందని కే‌సి‌ఆర్ ను ఉద్దేశించి అన్నారు.ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బి‌జే‌పి అద్యక్షుడు బండి సంజయ్ పై ఘాటు విమర్శలు చేశాడు.వరదల్లో ద్విచక్ర వాహనాలు పాడైతే ఇన్సూరెన్స్ పరిహారం ఇస్తాడట..నువ్వేమైన ఇన్సూరెన్స్ ఏజెంట్ వా ,లేక పార్టీ ప్రసిడెంట్ వా ..

అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇన్సూరెన్స్ పరిహారం నువ్వు ఇవ్వకున్న ఆ కంపెనీ వల్లే ఇస్తారన్నారు.ఈ మాత్రం రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళకు అధికారం ఇస్తే పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టు కదా .. అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు శత్రు దేశం పైన చేసే వాటిని సర్జికల్ స్టైక్స్ అంటారని, హైదరబాద్ నీకు శత్రు దేశంలా కనిపిస్తోందా..అంటూ సూటిగా ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: