దిల్సుఖ్ నగర్ జోన్ పరిధిలోని బీజేపీ అభ్యర్థి బొక్క భాగ్యలక్ష్మీ విసృత్త ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో మూసారంబాగ్ డివిజలో బీజేపీ విజయకేతనం ఎగుర వేస్తుందని ఆపార్టీ డివిజన్ అధ్యక్షుడు గౌర విజయ్కాంత్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం డివిజన్ లోని పలుప్రాంతాలలో అభ్యర్ధి బొక్క భాగ్యలక్ష్మీ పార్టీ నాయకులతో కలిసి గడప గడపకు ప్రచారం చేశారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున బైక్ర్యాలీ నిర్వహించారు.
ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఓటేస్తే ఎంఐఎం పార్టీ వేసినట్లేనని పేర్కొన్నారు. వరద సాహయాన్ని కూడా బాధితులకు అందకుండా తమ జేబుల్లోకి నొక్కేసిన టీఆర్ఎస్ కు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని జోస్యం చేప్పారు. కమలం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో దేవేందర్, సురేందర్, రమేష్రెడ్డి, సందడి సురేందర్రెడ్డి, మోహన్రెడ్డి, రాముయాదవ్, శశికాంత్, దినేష్, మురళీ, సత్యనారాయణ, భరత్, తదితరులు పాల్గొన్నారు.