జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 1122 మంది అభ్యర్థులు పాల్గొనబోతున్నారు. టీఆర్ఎస్ నుంచి 150 మంది, బీజేపీ నుంచి 149, కాంగ్రెస్ నుంచి 146 మంది, టీడీపీ నుంచి 106 మంది, ఎంఐఎం నుంచి 51 మంది, సీపీఐ నుంచి 17 మంది, సీపీఎం నుంచి 12 మంది వీరితో పాటు 415 మంది ఇండిపెండెంట్ పోటీదారులు కూడా ఎన్నికల బరిలో ఉన్నారు.మొత్తంగా చూసుకున్నట్లయితే 74 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కోసం ఏర్పాట్లు చాలా అట్టహాసంగా సాగుతున్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 9,101 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. కొవిడ్ 19 మార్గదర్శకాలకు లోబడి ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. జంగమ్మెట్ డివిజన్ పోటీలో అత్యధికంగా 20 మంది పోటీదారులు బరిలో ఉండగా ఉప్పల్, బార్కస్, నవాబ్సాహెబ్కుంట, టోలిచౌకి, జీడిమెట్ల ఈ ఐదు డివిజన్లలో కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు.ఇలాంటి మరెన్నో అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...