వివరాల్లోకి వెళ్తే.. కెన్యాకు చెందిన 32 ఏళ్ల పీటర్ కిగెన్ ఇంట్లో అప్పటిదాకా సరదాగా నవ్వుతూ గడిపాడు. యితే ఏమైందో ఏమోగాని అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని కాప్కాటెట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి సిబ్బంది అతడు మృతి చెందినట్లుగా నిర్దారించారు. అందులో భాగంగా అతడి శరీరం నుంచి రక్తాన్ని వేరు చేసే ప్రక్రియను మొదలు పెట్టారు. ఇంతలో అతడు నొప్పితో కళ్లు తెరిచి, కేకలు పెట్టగా చనిపోయిన వ్యక్తికి మళ్లీ ప్రాణం వచ్చిందని సిబ్బంది భయభ్రాంతులకు లోనయ్యారు. కాసేపటికే అతడు చనిపోలేదని నిర్ధారణకు క్యాజువల్ సాధారణ వార్డులోకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే ఈ షాకింగ్ ఘటన గురించి కైగెన్ సోదరుడు మాట్లాడుతూ.. మార్చురీలో ఉన్న వ్యక్తి కంగారుగా మా దగ్గరకు వచ్చి లోపలకు రమ్మన్నారు. అక్కడ కైగెన్ శరీరంలో కదలికలు చూసి షాక్ అయ్యాం. ఓ క్షణం పాటు ఏం జరుగుతుందనేది మాకే అర్థం కాలేదు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. మరోవైపు కైగెన్ మాట్లాడుతూ.. 'ఇది నేనే నమ్మలేకపోతున్నాను. నేను చనిపోయానని డాక్టర్లు ఎలా చెప్పారు? అసలు ఎప్పుడు స్పృహ కోల్పోయానో, ఎప్పుడు తిరిగి ఈ లోకంలోకి వచ్చానో నాకే తెలీట్లేదు. ఏదేమైనా నాకు మళ్లీ జీవితాన్ని ప్రసాదించినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు" అని సంతోషం వ్యక్తం చేశారు.