వారి కష్టమే దుబ్బాక లో గెలిచేలా చేసింది, గ్రేటర్ లో గెలిచేలా చేస్తుందని తప్పకుండా చెప్పొచ్చు. గ్రేటర్ లో బీజేపీ గెలుపు దాదాపు ఖాయమని జన సందోహం చూస్తే తెలుస్తుంది. అయితే దీన్ని తెరాస నేతలు వేరేలా చెప్తున్నారు.. గ్రేటర్ లో బీజేపీ గెలిస్తే ఏమవుద్దో జోస్యం చెప్తున్నారు.. ఇప్పుడు ఉన్న ప్రశాంత వాతావరణం ఉండదని చెపుతున్నారు. ప్రతిరోజు గ్రేటర్ పరిధిలో గొడవల్లవటం తప్ప ఇక్కడ పార్టీ చేసేదేం ఉండదని చెపుతున్నారు.
మొన్నటి దుబ్బాక ఉపఎన్నికలో గెలిచిన దగ్గర నుండి బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎంతగా రెచ్చిపోతున్నారనే విషయాన్ని అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు చూస్తే అర్ధమైపోతోంది. సరే గెలుపోటములను పక్కన పెట్టేస్తే ఒకవేళ కమలం పార్టీ గెలిస్తే మాత్రం ప్రతిరోజు గొడవలే గొడవలు. ఎందుకంటే గ్రేటర్ లో గెలిచినంత మాత్రాన రాష్ట్రప్రభుత్వంపై పట్టుసాధించేది లేదు. గ్రేటర్ ఎన్నికలంటే మినీ తెలంగాణా ఎన్నికలనే అనుకోవాలి. అందుకనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాము విజయం సాధించేసినట్లే బీజేపీ నేతలు ఫీలైపోతారు. దాంతో ప్రతిరోజు వివాదాలు జరుగుతునే ఉంటాయి. ఇప్పటికే ప్రచారంలో ఎంఐఎం ను తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.