మైలార్ దేవ్ పల్లి లో మా కార్యకర్తలు 40 లక్షలు పట్టించారు.. అయిన కేసు బుక్ చేయలేదని ఆయన అన్నారు. మన్సూరాబాద్ లో సాక్షాత్తు మంత్రి డబ్బులు పంచారని ఆయన అన్నారు. కార్యకర్తల పై దాడులు చేస్తున్నారన్న ఆయన. దాడికి ప్రతి దాడులకు సిద్ధమని అన్నారు. శాంతి భద్రతల సమస్య వస్తే డీజీపీ,ఈసీలదే బాధ్యత అని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత దిగజారి వ్యవహరిస్తారా ? అని ఆయన ప్రశ్నించారు. మహేందర్ రెడ్డి అంటే గౌరవం ఉండేది ఆయన కూడా ఇంత దిగజారి వ్యవహరిస్తున్నారని అన్నారు.
ఎన్ని చేసినా గ్రేటర్ లో గెలిచేది బీజేపీనేనన్న సంజయ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది ఎందుకు టీఆర్ఎస్ ఎలా గెలవాలి అని సలహాలు ఇవ్వడానికా ? అని ఆయన ప్రశ్నించారు. చర్యకు ప్రతి చర్య కు అవకాశం ఇవ్వకండన్న ఆయన పోలీసులను చూసి ప్రజలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కార్యకర్తలు రోడ్డెక్కితే ఏమవుతుందో చూడండి.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని అన్నారు. పోలీసు అధికారులు ముఖ్యమంత్రి మాటలు పట్టించుకోకండి....రేపు ఇబ్బంది పడేది మీరే అని ఆయన హెచ్చరించారు. సహనాన్ని పిరికితనం గా భావించకండి.. రేపు గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తే కలిసి ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు.