ఆదివారం గాంధీనగర్ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో రోడ్షో, పాదయాత్ర నిర్వహించారు. అనంతరం డివిజన్ అభ్యర్థి పద్మనరేశ్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మొన్నటివరకు ఎమ్మెల్యే ఎన్నికల్లో మనకు బండ్ల గణేష్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేది ఆ స్థానాన్ని ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భర్తీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రోజుకో వింత విషయాలతో ప్రజల ముందుకొస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల దీవెనలు ఉన్నంత వరకు కేసీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదన్నారు. ప్రతిఒక్కరూ టీఆర్ఎస్ అభ్యర్థి పద్మనరేశ్కు ఓట్లు వేసి టీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆదివారం గాంధీనగర్ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో రోడ్షో, పాదయాత్ర నిర్వహించారు. అనంతరం డివిజన్ అభ్యర్థి పద్మనరేశ్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మొన్నటివరకు ఎమ్మెల్యే ఎన్నికల్లో మనకు బండ్ల గణేష్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేది ఆ స్థానాన్ని ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భర్తీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రోజుకో వింత విషయాలతో ప్రజల ముందుకొస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల దీవెనలు ఉన్నంత వరకు కేసీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదన్నారు. ప్రతిఒక్కరూ టీఆర్ఎస్ అభ్యర్థి పద్మనరేశ్కు ఓట్లు వేసి టీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.